రామ్ చరణ్,ఎన్ .టి .ఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆర్ .ఆర్.ఆర్. ఈ సినిమా గురించి ప్రతి చిన్న విషయం కూడా బయటికి రాకుండా రాజమౌళి శ్రద్హ వహిస్తున్నాడు.
కానీ ప్రేక్షకులు మాత్రం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రెండుషెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ జరుపుకోవాల్సి ఉన్నది. కానీ ఇంతలో చరణ్ కాలికి గాయంగాయం కావడంతో షూటింగ్ వాయిదా పడింది .
ఇంతవరకు చేసిన సినిమా వరకు గ్రాఫిక్ వర్క్ చేస్తున్నాడట జక్కన్న. ఇక త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ మొదలుపెడుతారని సమాచారం. ఈ షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ కు సంబందించిన సన్నివేశాలు మాత్రమే ఉంటాయట. ప్రస్తుతం చరణ్ తన ఫామిలీతో ఫారిన్ ట్రిప్ వెళ్లారు.
ఆఫ్రికా ఖండంలో టాంజినియా లోని సెరెంగెటి నేషనల్ పార్క్ కు వెళ్లారు చరణ్ దంపతులు. అక్కడ ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారట. ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ఉపాసన మిస్టర్ 'సి' తో సెరెంగెటి నేషనల్ పార్క్ లో వారు ఉన్న వీడియోని షేర్ చేసింది. ట్రిపుల్ ఆర్ కు బ్రేక్ ఇచ్చి చరణ్ ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలుస్తుంది.
కొన్ని రోజుల క్రితం చరణ్ తాను చదువుకున్న పాఠశాలకు వెళ్లి అక్కడి పిల్లలతో కొంత కాలక్షేపం కూడా చేసాడు . అలాగే తనకి ఆ పాఠశాలలో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు .
No comments:
Post a Comment