Thursday, May 30, 2019

కొరటాల శివ నిర్మాణములో మహేష్ బాబు

Latest telugu Film News


మహేష్ బాబు మహర్షి తరువాత  అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

సరిలేరు నీకెవ్వరూ టైటిల్ తో రూపొందుతున్న  ఈ సినిమాని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు  తన 27వ  సినిమా గీత గోవిందం  డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తుంది.


గీతా ఆర్ట్స్ సంస్థలో  పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా రూపొందుతుందట. అయితే ఈ సినిమా నిర్మాణంలో కొరటాల శివ కూడా భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాడట.



తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో మహేష్ తో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడట . పరుశురాం సినిమాకు ఆ  అవకాశం దొరికేలా  ఉన్నదని సమాచారం.గీత ఆర్ట్స్ తో మహేష్ కోరిక మేరకు నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేస్తున్నారని సమాచారం.  మహేష్ తో శ్రీమంతుడు , భరత్ అనే నేను సినిమాలు చేసిన కొరటాల శివ ఇప్పుడు మహేష్ బాబు సినిమాని నిర్మించాలని అనుకుంటున్నాడు. ఈ చిత్రం ఇంకా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో,ఎవరు నిర్మిస్తారో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాలి 

No comments:

Post a Comment