మహేష్ బాబు మహర్షి తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
సరిలేరు నీకెవ్వరూ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన 27వ సినిమా గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తుంది.
గీతా ఆర్ట్స్ సంస్థలో పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా రూపొందుతుందట. అయితే ఈ సినిమా నిర్మాణంలో కొరటాల శివ కూడా భాగస్వామ్యం కావాలని అనుకుంటున్నాడట.
తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో మహేష్ తో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడట . పరుశురాం సినిమాకు ఆ అవకాశం దొరికేలా ఉన్నదని సమాచారం.గీత ఆర్ట్స్ తో మహేష్ కోరిక మేరకు నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేస్తున్నారని సమాచారం. మహేష్ తో శ్రీమంతుడు , భరత్ అనే నేను సినిమాలు చేసిన కొరటాల శివ ఇప్పుడు మహేష్ బాబు సినిమాని నిర్మించాలని అనుకుంటున్నాడు. ఈ చిత్రం ఇంకా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో,ఎవరు నిర్మిస్తారో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాలి
No comments:
Post a Comment